సాల్ట్ వాటర్ తో ప్రయోజనాలు..
- October 17, 2020
చిటికెడు సాల్ట్ కూరకి ఎంతో రుచిని ఇస్తుంది. ఆ కొంచెం వేయకపోతే ఎన్ని రుచికరమైన దినుసులు వేసినా తినలేరు. అదే మరి ఉప్పుకున్నమహత్యం. ఇక బీపీ ఉన్న వారికి ఉప్పు అస్సలు వాడొద్దని చెబుతారు డాక్టర్లు. ఉప్పు ఎంత చెడ్డదో అంత మంచిది కూడా. పచ్చళ్లు నిల్వ ఉండాలంటే సరిపడినంత ఉప్పు వేయాలి. కొంచెం తక్కువైనా పచ్చడి పాడైపోతుంది. తక్కువైతే నోటికి రుచిగా కూడా అనిపించదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఉప్పు బాగా పని చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా సాల్ట్ కలిపి తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది. ఈ వాటర్ పొట్టని క్లీన్ చేస్తుంది. అలా అని ఎక్కువ తాగితే రక్తపోటు పెరిగి ప్రమాదానికి దారి తీస్తుంది. శరీరంలో తగినంత సోడియం ఉంటే కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. ఉప్పు నీటిని పుక్కిలించడం వల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల బ్యాక్టీరియా తొలగిపోతుంది. నోటి సమస్యల నివారణకు వాడే పేస్ట్ కంటే సాల్ట్ వాటర్ ఉత్తమం.
ఎండలో ఎక్కువగా పని చేసేవారు డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. శరీరంలోని ఉప్పంతా ఇతర మార్గాల ద్వారా బయటకు వెళుతుంది. ఆ సమయంలో సాల్ట్ వాటర్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే శరీరం మళ్లీ జీవం పుంజుకుంటుంది. స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసి చేస్తే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర అలసటను, కాలి మడమల నొప్పులను నివారించేందుకు వేడి నీటిలో ఉప్పు వేసి పాదాలు మునిగే వరకు ఓ 20 నిమిషాల పాటు ఉంచితే రిలీఫ్ గా ఉంటుంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!