భారత్ లో కొత్తగా 61,871 కరోనా పాజిటివ్ కేసులు
- October 18, 2020న్యూ ఢిల్లీ:భారత్ లో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 74 లక్షల 94 వేలు దాటాయి. గడచిన 24 గంటలలోనే దేశవ్యాప్తంగా 61,871 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా దేశవ్యాప్తంగా నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,94,552కు చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వైరస్ తో మొత్తం 1033 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 1,14,031కు చేరింది. అదే విధంగా గడచిన 24 గంటలలో కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 72,614గా నమోదయింది.
దీంతో ఇప్పటి వరకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 65,97,209 కు చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 7,83,311గా ఉన్నాయి. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 9,70,173 టెస్టులు నిర్వహించగా ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 9,42,24,190 కు చేరింది. ఇక రికవరీ రేటు విషయానికొస్తే దేశంలో 88.03 శాతం ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 10.45 శాతంగా నమోదయింది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి మరణాల రేటు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు