శబరిమలలో కలకలం.. భక్తుడికి కరోనా నిర్ధారణ
- October 19, 2020
శబరిమలలో కరోనా కలకలం రేపింది. దర్శనానికి వచ్చిన ఒక భక్తుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో యాత్రకు వచ్చిన మిగతా భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ వచ్చిన భక్తుడిని తమిళనాడు వాసిగా గుర్తించారు. అతడిని కరోనా కేంద్రానికి తరలించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం శబరిమలకు వచ్చే వారికి మార్గదర్శకాలను విడుదల చేసింది. శబరిమల యాత్రికులు దర్శనం కోసం టైమ్ స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికోసం https://sabarimalaonline.org వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు 48 గంటల ముందు యాంటిజెన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షలకు సంబంధించిన పత్రాలను ఆలయ అధికారులకు చూపించాలి. ఇందులో నెగటివ్ అని తేలిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ప్రతిరోజు కేవలం 250 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా 10 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్నవారికి మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అలాగే భక్తులు పంబ నదిలో స్నానాలు చేయడం, అభిషేకాలు చేయడాన్ని నిషేధించారు. భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









