సౌదీలో 96 శాతానికి పెరిగిన కరోనా రికవరి రేటు..400 మార్క్ లోపే పాజిటివ్ కేసులు
- October 19, 2020రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొద్దిమేర నిలకడగా కనిపిస్తోంది. సోమవారం కూడా 400 మార్క్ లోపే పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,42,583కి పెరిగింది. మరోవైపు కరోనా కేసులతో పాటు కరోనా రికవరి రేటు కూడా ఆశాజనకంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,28,895 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో కింగ్డమ్ పరిధిలో కరోనా రికవరి రేటు 96 శాతానికి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 16 మంది మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 5,201కి చేరింది. ప్రస్తుతం సౌదీ వ్యాప్తంగా 8,487 యాక్టీవ్ కేసులు ఉండగా..844 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..