సౌదీలో 96 శాతానికి పెరిగిన కరోనా రికవరి రేటు..400 మార్క్ లోపే పాజిటివ్ కేసులు
- October 19, 2020రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొద్దిమేర నిలకడగా కనిపిస్తోంది. సోమవారం కూడా 400 మార్క్ లోపే పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,42,583కి పెరిగింది. మరోవైపు కరోనా కేసులతో పాటు కరోనా రికవరి రేటు కూడా ఆశాజనకంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,28,895 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో కింగ్డమ్ పరిధిలో కరోనా రికవరి రేటు 96 శాతానికి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 16 మంది మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 5,201కి చేరింది. ప్రస్తుతం సౌదీ వ్యాప్తంగా 8,487 యాక్టీవ్ కేసులు ఉండగా..844 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…