సౌదీలో 96 శాతానికి పెరిగిన కరోనా రికవరి రేటు..400 మార్క్ లోపే పాజిటివ్ కేసులు
- October 19, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొద్దిమేర నిలకడగా కనిపిస్తోంది. సోమవారం కూడా 400 మార్క్ లోపే పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,42,583కి పెరిగింది. మరోవైపు కరోనా కేసులతో పాటు కరోనా రికవరి రేటు కూడా ఆశాజనకంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,28,895 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో కింగ్డమ్ పరిధిలో కరోనా రికవరి రేటు 96 శాతానికి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 16 మంది మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 5,201కి చేరింది. ప్రస్తుతం సౌదీ వ్యాప్తంగా 8,487 యాక్టీవ్ కేసులు ఉండగా..844 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు