సౌదీలో 96 శాతానికి పెరిగిన కరోనా రికవరి రేటు..400 మార్క్ లోపే పాజిటివ్ కేసులు
- October 19, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొద్దిమేర నిలకడగా కనిపిస్తోంది. సోమవారం కూడా 400 మార్క్ లోపే పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,42,583కి పెరిగింది. మరోవైపు కరోనా కేసులతో పాటు కరోనా రికవరి రేటు కూడా ఆశాజనకంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,28,895 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో కింగ్డమ్ పరిధిలో కరోనా రికవరి రేటు 96 శాతానికి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 16 మంది మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 5,201కి చేరింది. ప్రస్తుతం సౌదీ వ్యాప్తంగా 8,487 యాక్టీవ్ కేసులు ఉండగా..844 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









