దుబాయ్: వచ్చే వారంలో ఈ-స్కూటర్ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం
- October 20, 2020
దుబాయ్:పర్యావరణహితం, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు దోహదపడే ఈ-స్కూటర్ లను వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు రోడ్డు, రవాణా అధికార విభాగం ప్రకటించింది. న్యూ అల్ ఘుబైబా బస్ స్టేషన్ సందర్శనలో భాగంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ఈ-స్కూటర్ ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఈ-స్కూటర్ ప్రాజెక్టులో ఐదు ఆపరేట్ సంస్థలు భాగస్వామ్యం అవుతన్నట్లు ఆర్టీఏ వివరించింది. వీటిలో కారెం, లైమ్, టైర్ అనే మూడు అంతర్జాతీయ సంస్థలతో పాటు దుబాయ్ ఎస్ఎంఈ మద్దతు ఉన్న రెండు స్థానిక సంస్థలు అర్నాబ్, స్కుర్ట్ భాగస్వామ్యం అవుతున్నాయి. ట్రయల్ రన్ గా ప్రస్తుతం దుబాయ్ లోని ఐదు జోన్లలో ఈ-స్కూటర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, రెండో డిసెంబర్ సెయింట్, అల్ రిగ్గ, జుమేరా లేక్ టవర్స్ జోన్లను ఈ-స్కూటర్ ప్రాజెక్టు ప్రారంభానికి ఎంపిక చేశారు. జనాభా సాంద్రత, ప్రైవేట్ సంస్థల అభివృద్ధి సూచిక, ప్రజా రవాణా సేవల లభ్యత, సమీకృత మౌలిక సదుపాయాలు, అధిక ట్రాఫిక్ భద్రతా రికార్డులు వంటి నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఈ జోన్లను ఎంపిక చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం