దసరా పండుగ అందరికి విజయాలు చేకూర్చాలి:సీపీ మహేష్ భగవత్
- October 25, 2020హైదరాబాద్:దసరా పండుగ సందర్భంగా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. ఈ రోజు రాచకొండ సీపీ మహేష్ భగవత్ అంబేర్ పేట హెడ్ క్వార్టర్ లో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవాన్ని అంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ ప్రజాభిమనం పొందుతూ వారి మన్ననలందుకునేలా పని చేస్తూ పోలీసుల గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా పని చేయాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శిలపవల్లి, అడిషనల్ డీసీపీ శంకర్ నాయక్, శమీర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు