750 కిలోల బరువున్న బంగారు అంబారీని మోసిన అభిమన్యు
- October 26, 2020
మైసూర్:దసరా వేడుకలనగానే గుర్తొచ్చేది మైసూరు. నమ్మద హబ్బ పేరిట ఏటా దసరా ఉత్సవాలను నిర్వహిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. కర్నాటక సంస్కృతీ సంప్రదాయలకు ఈ ఉత్సవాలు చిహ్నంగా నిలుస్తాయి. మైసూరు మహారాజు కాలం నుండి దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే.. ఈ సారి దసరా ఉత్సవాలపై కరోనా ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. అయినప్పటికి సాంప్రదాయరీతిలో , భక్తిశ్రద్దలతో దసరా ఉత్సవాలను నిర్వహించారు. ఇక... మైసూర్ ఉత్సవాల్లో హైలెట్ ఏనుగుల జంబూ సవారీ!. మైసూరు మహారాజు వారి కులదైవం చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. అమ్మవారికి సీఎం యడ్యూరప్ప ప్రత్యేక పూజలు చేశారు. ఏటా వేలాది మంది పాల్గొనే ఈ సవారీలో ఈసారి కేవలం 300 మంది అతిథులు మాత్రమే పాల్గొన్నారు. అది కూడా కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వాళ్లకే అనుమతించారు. జంబూ సవారిలో అభిమన్యు ఏనుగు.... ఠీవీగా నడిచింది. 750 కిలోల బరువున్న బంగారు అంబారీని అభిమన్యు మోసింది. అభిమన్యు వెంట కావేరి, విజయ,గోపి అనే ఏనుగులు నడిచాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!