750 కిలోల బరువున్న బంగారు అంబారీని మోసిన అభిమన్యు
- October 26, 2020
మైసూర్:దసరా వేడుకలనగానే గుర్తొచ్చేది మైసూరు. నమ్మద హబ్బ పేరిట ఏటా దసరా ఉత్సవాలను నిర్వహిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. కర్నాటక సంస్కృతీ సంప్రదాయలకు ఈ ఉత్సవాలు చిహ్నంగా నిలుస్తాయి. మైసూరు మహారాజు కాలం నుండి దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే.. ఈ సారి దసరా ఉత్సవాలపై కరోనా ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. అయినప్పటికి సాంప్రదాయరీతిలో , భక్తిశ్రద్దలతో దసరా ఉత్సవాలను నిర్వహించారు. ఇక... మైసూర్ ఉత్సవాల్లో హైలెట్ ఏనుగుల జంబూ సవారీ!. మైసూరు మహారాజు వారి కులదైవం చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. అమ్మవారికి సీఎం యడ్యూరప్ప ప్రత్యేక పూజలు చేశారు. ఏటా వేలాది మంది పాల్గొనే ఈ సవారీలో ఈసారి కేవలం 300 మంది అతిథులు మాత్రమే పాల్గొన్నారు. అది కూడా కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వాళ్లకే అనుమతించారు. జంబూ సవారిలో అభిమన్యు ఏనుగు.... ఠీవీగా నడిచింది. 750 కిలోల బరువున్న బంగారు అంబారీని అభిమన్యు మోసింది. అభిమన్యు వెంట కావేరి, విజయ,గోపి అనే ఏనుగులు నడిచాయి.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







