దుబాయ్ లో ప్రతి ఏడాది పెరుగుతున్న పాటశాలల ఫీజులు
- February 14, 2016దుబాయ్ లో తమ పిల్లలని ప్రైవేటు పాటశాలలో చదివించడం నానాటికి కష్టమైపోతుందని పలువురు తల్లితండ్రులు ఆవేదన చెందుతున్నారు. 2016 - 2017 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాటశాలల ఫీజులు కనిష్టంగా 3.21 శాతం, గరిష్టంగా 6.42 శాతం వరుకు పెరగనుంది. ఈ పెంపుదల ఆయా పాటశాలల ప్రమాణాలను బట్టి ఉంటుంది. ఈ పెరుగుదల నూతన విద్యావ్యయ సూచిక ( ఇ.సి.ఐ.) 2.92 శాతం నుంచి 3.21 శాతం వరుకు పెరుగుతుందని " నాలెడ్జే అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ " ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నూతన విద్యావ్యయ సూచిక ( ఇ.సి.ఐ.) పాటశాలల నిర్వహాణ ఖర్చులను అంచనా వేస్తుంది. వేతనాలు , అద్దెలు , వినియోగదారుల ధరలు వంటి తదితర ఖర్చులను దుబాయ్ గణాంకాల కేంద్రం ప్రతి ఏటా లెక్కిస్తారు. నూతన విద్యావ్యయ సూచిక ( ఇ.సి.ఐ.) ఆధారంగా పాటశాలల తనిఖీ తర్వాత అత్యుత్తమ ప్రమాణాలను బట్టి 6.42 శాతం ఫీజును ఏప్రిల్ లేదా మే నెలలో పెంచవచ్చు. ' చాలా మంచిది ' అని ఆయా పాటశాలకు అర్హత వస్తే, 5.62 శాతం , ' మంచిది ' అని ఆయా పాటశాలకు అర్హత వస్తే, 4.82 శాతం ఫీజులను, సాధారణ స్థాయి ఉంటె , 3.21 శాతం వరకు దుబాయ్ లో ఆయా పాటశాలల యాజమాన్యం పెంచుకోవచ్చు. తల్లితండ్రుల స్పందన ప్రైవేటు పాటశాలల యాజమాన్యాలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్న ఈ ఫీజులు పెంపుదల నిర్ణయం విద్యార్ధుల తల్లితండ్రులకు మింగుడుపడటం లేదు. భారంగా మారిన ఈ ధోరణులపై ' గల్ఫ్ న్యూస్ ' తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. జోర్డాన్ కు చెందిన 10 సంవత్సరాల విద్యార్ధి తండ్రి హస్సన్ నజీమ్ మాట్లాడుతూ, ఇదే విధంగా ప్రతి ఏడాది పాటశాలల ఫీజులు క్రమం తప్పకుండా పెరుగుతుంటే, తనలాంటి సామాన్యులు దుబాయ్ లో పిల్లలను చదివించడానికి భయపడతారని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల