ఓవర్ క్రౌడెడ్ వర్కర్స్ అకామడేషన్స్పై ఉక్కుపాదం
- October 29, 2020
షార్జా:షార్జాలోని పలు వర్కర్స్ అకామడేషన్స్లో ఓవర్ క్రౌడెడ్ ఎక్కువగా వుంటున్నట్లు గుర్తించిన అధికారులు, ఆయా అకామడేషన్స్పై ఉక్కుపాదం మోపుతున్నారు. 500 మందికి సరిపోయే అకామడేషన్స్లో 800 మంది వరకూ వుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. వీటిని సీరియస్ ఉల్లంఘనలుగా పరిగణిస్తున్నామనీ, షార్జా ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎమర్జన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఛైర్మన్ బ్రిగేడియర్ అహ్మద్ సయీద్ అల్ నవూర్ మాట్లాడుతూ, ఒక రూంలో కేవలం నలుగరు మాత్రమే వుండాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువమందికి అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కాగా, 90 శాతం కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కరోనా నిబంధనల్ని పాటిస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఎప్పటికప్పుడు అవేర్నెస్ డ్రైవ్స్ కొనసాగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!