బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- September 14, 2025
మనామా: బహ్రెయిన్ లో డేంజరస్ యానిమల్స్ పై యాజమాన్యం మరియు వాణిజ్యాన్ని నియంత్రించే లక్ష్యంతో చట్టం చేయనున్నారు. ఈ మేరకు రాబోయే శాసనసభ సమావేశంలో ప్రతినిధుల మండలిలో ఓటింగ్ నిర్వహించనున్నారు. బహ్రెయిన్ లో ఈ తరహా చట్టాన్ని రూపొందించడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే, కమ్యూనిటీ భద్రత మెరుగవ్వడంతోపాటు ఆయా యానిమల్స్ కు కూడా సరైన షెల్టర్ లభిస్తుందన్నారు. ఇకపై డేంజరస్ యానిమల్స్ ను ఇండ్లలో పెంచుకునేందుకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
ముసాయిదా చట్టం ప్రకారం, జంతు ప్రదర్శనశాలలు, వన్యప్రాణుల పార్కులు, సర్కస్లు, పరిశోధన మరియు శాస్త్రీయ సంస్థలు, అలాగే ప్రభుత్వం, భద్రతా మరియు సైనిక సంస్థలకు మాత్రమే డేంజరస్ యానిమల్స్ ను పెట్టుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇక నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్షతోపాటు BD 1,000 మరియు BD 10,000 మధ్య జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వేటాడే జంతువులను బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకురావడం, వాటి వల్ల ప్రజలకు నష్టం కలిగించడం లాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకుంటారు. అలాంటి నేరాలకు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!







