యూఏఈ:భారత్ చేరుకునే ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనల్లో స్వల్ప సవరణలు
- October 29, 2020
యూఏఈ:వివిధ కారణాలతో భారత్ చేరుకునే అంతర్జాతీయ ప్రయాణీకులతో పాటు దేశీయ ప్రయాణికులకు సంబంధించి క్వారంటైన్ నిబంధనలను స్వల్పంగా సవరించారు. యూఏఈతో పాటు ఇతర దేశాల నుంచి పర్సనల్ ట్రిప్, ప్రొఫిషనల్ పనుల మీద భారత్ వచ్చే వాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నాయి. ప్రతి రోజు ఒక్క యూఏఈ నుంచే భారత్ కు 4000 వేల మంది వెళ్తుంటారని దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అయితే..స్వల్ప, దీర్ఘకాలిక గడువుపై భారత్ చేరుకునే వాళ్లు ర్యాపిడ్ టెస్టులు విధిగా చేయించుకోవాల్సి ఉంటుంది. నెగటీవ్ రిపోర్ట్ వస్తే హోం క్వారంటైన్ కు అనుమతిస్తారు. ఇక తమ రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 72 గంటల ముందు https://www.spandana.ap.gov.inవెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేందుకు సుముఖంగా ఉన్నట్లు డిక్లరేషన్ లో పేర్కొవాల్సి ఉంటుంది. ఇక ఎయిర్ పోర్టుకు చేరుకోగానే 500 రూపాయలు చెల్లించి కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ టెస్టులో నెగటీవ్ వస్తే వారిని హోం క్వారంటైన్ లో ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ కలిగి ఉన్న ప్రయాణికులకు మాత్రం ఎయిర్ పోర్టులో ర్యాపిడ్ టెస్టుల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







