యూఏఈ:భారత్ చేరుకునే ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనల్లో స్వల్ప సవరణలు
- October 29, 2020
యూఏఈ:వివిధ కారణాలతో భారత్ చేరుకునే అంతర్జాతీయ ప్రయాణీకులతో పాటు దేశీయ ప్రయాణికులకు సంబంధించి క్వారంటైన్ నిబంధనలను స్వల్పంగా సవరించారు. యూఏఈతో పాటు ఇతర దేశాల నుంచి పర్సనల్ ట్రిప్, ప్రొఫిషనల్ పనుల మీద భారత్ వచ్చే వాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నాయి. ప్రతి రోజు ఒక్క యూఏఈ నుంచే భారత్ కు 4000 వేల మంది వెళ్తుంటారని దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అయితే..స్వల్ప, దీర్ఘకాలిక గడువుపై భారత్ చేరుకునే వాళ్లు ర్యాపిడ్ టెస్టులు విధిగా చేయించుకోవాల్సి ఉంటుంది. నెగటీవ్ రిపోర్ట్ వస్తే హోం క్వారంటైన్ కు అనుమతిస్తారు. ఇక తమ రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 72 గంటల ముందు https://www.spandana.ap.gov.inవెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేందుకు సుముఖంగా ఉన్నట్లు డిక్లరేషన్ లో పేర్కొవాల్సి ఉంటుంది. ఇక ఎయిర్ పోర్టుకు చేరుకోగానే 500 రూపాయలు చెల్లించి కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ టెస్టులో నెగటీవ్ వస్తే వారిని హోం క్వారంటైన్ లో ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ కలిగి ఉన్న ప్రయాణికులకు మాత్రం ఎయిర్ పోర్టులో ర్యాపిడ్ టెస్టుల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







