దోహా:తనిఖీల పేరుతో ఓవరాక్షన్ చేసిన ఎయిర్ పోర్టు అధికారులపై విచారణకు ఆదేశం
- October 31, 2020
దోహా:విమానాశ్రయంలో తనిఖీల పేరుతో మహిళల పట్ల అతిగా ప్రవర్తించిన ఘటనలో విచారణకు ఆదేశించింది ఖతార్ ప్రభుత్వం. అభ్యంతరకరంగా తనిఖీలు నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ ఘటన అక్టోబర్ మొదటి వారంలోనే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 2న దోహా ఎయిర్ పోర్టు బాత్రూంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ నవజాత శిశువును వదిలివెళ్లారు. ఆ శిశువు అమ్మ ఎవరో నిర్ధారించుకునేందుకు ఆ సమయంలో ప్రయాణించిన 10 విమానాల్లోని మహిళా ప్రయాణికులను పరీక్షించాలని అధికారులు నిర్ధారించి...మహిళా ప్రయాణికుల జననేంద్రియాలను పరిశీలించారు. అయితే..ఈ ఘటన పెను దుమారమే లేపింది. అంతర్జాతీయంగా కూడా పలు దేశాలు దోహా ఎయిర్ పోర్టు అధికారుల తీరును తీవ్రంగా పట్టుబట్టాయి. జననేంద్రియ పరీక్షల బాధితుల్లో తమ దేశానికి చెందిన మహిళ కూడా ఉందని..ఇలాంటి పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని న్యూజిలాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎయిర్ పోర్టు అధికారుల తీరుపై దుమారం రేగడంతో..ఘటనపై స్పందించిన ఖతార్ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించటంతో పాటు అభ్యంతరకర పరీక్షల పట్ల బాధితులు క్షమాణలు చెప్పింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..