ఎయిర్‌ ఇండియా సేల్‌ డెడ్‌లైన్‌ పొడిగింపు

- October 31, 2020 , by Maagulf
ఎయిర్‌ ఇండియా సేల్‌ డెడ్‌లైన్‌ పొడిగింపు

న్యూ ఢిల్లీ:ఎయిర్‌ ఇండియా సేల్‌ డెడ్‌లైన్‌ని భారత ప్రభుత్వం పొడిగించింది. ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ సబ్‌మిషన్‌కి నేటితో గడువు పూర్తవుతుంది. అయితే, కరోనా నేపథ్యంలో చాలామంది డెడ్‌లైన్‌లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. కాగా, డిసెంబర్‌ 14వ తేదీ వరకు డెడ్‌లైన్‌ని పొడిగించడం జరిగింది. ఎవరైతే బిడ్స్‌కి క్వాలిఫై అవుతారో ఆ వివరాల్ని డిసెంబర్‌ 28 లోగా తెలియజేస్తారు. కాగా, ఎయిర్‌ ఇండియా ప్రైవేటైజేషన్‌కి సంబంధించి కొన్ని మార్పులు కూడా చేసినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్టిమెంట్‌ మరియు పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. బిడ్డర్స్‌, కంబైన్డ్‌ వాల్యూని కోట్‌ చేయవచ్చు. అత్యధిక ఆఫర్‌ ఈ బిడ్‌ని గెలుచుకుంటుంది. షార్ట్‌ టర్మ్‌ మరియు లాంగ్‌ టెర్మ్‌ డెబిట్‌కి సంబంధించి ఈక్విటీ వాల్యూని కూడా ఇందులో పొందుపరిచారు.9,600 మంది స్ట్రాంగ్‌ పర్మనెంట్‌ వర్క్‌ ఫోర్స్‌కి సంబంధించి ఏడాది వరకు వర్క్‌ ప్రొటెక్షన్‌ని రూల్స్‌లో పొందుపరచడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com