హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తంచేసిన ఆర్జీవీ
- November 06, 2020
హైదరాబాద్:'మర్డర్' సినిమా విడుదల నిలిపివేయాలని నల్లగొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టివేయడంపై ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హర్షం వ్యక్తంచేశాడు. మర్డర్ సినిమా తీయడం వెనుక ఉన్న మా ఉద్దేశాన్ని గౌరవనీయులైన న్యాయమూర్తి అర్థం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని ట్వీట్ చేశాడు. తీర్పునకు సంబంధించిన మొత్తం సమాచారం మా వద్దకు వచ్చిన తర్వాత సినిమా అప్ డేట్ ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు అని' తెలిపాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా 'మర్డర్' సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ సినిమా ప్రకటన అనంతరం ప్రణయ్ కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ నల్లగొండ కోర్టును ఆశ్రయించారు. దీంతో సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తూ చిత్ర యూనిట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు స్టే ఆర్డర్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









