అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నా:జో బైడెన్
- November 07, 2020
అమెరికా:స్పష్టమైన మెజారిటీతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నానని... డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు తుది అంకానికి చేరిన వేళ... జో బైడెన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. 40 లక్షల మెజారిటీతో... భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నట్టు బైడెన్ తెలిపారు. కనీసం 300 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు లభిస్తాయని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయం ముందున్న మనం... శాంతియుతంగా ఉండాలని... పిలుపునిచ్చారు. అమెరికా అంతా తమ పార్టీ అద్భుత ప్రదర్శన ఇచ్చిందన్నారు జై బైడెన్ విజేత ఎవరో ఈ రోజు దాదాపు ఖరారు అయ్యే అవకాశాలున్నాయి. జార్జియా, పెన్సిల్వేనియా, నెవడాలో.. బైడెన్ ఆధిక్యం కొనసాగుతోంది. వీటిలో ఏ ఒక్కటి గెలిచినా... బైడెన్ విజయం సాధించినట్లే. అయితే.. ట్రంప్ చేయాలనుకుంటున్న న్యాయపోరాటం బైడెన్ గెలుపు ప్రకటనను కాస్త ఆలస్యం చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









