సౌదీలో మళ్లీ కరోనా తీవ్రత..మరో 19 మంది మృతి

- November 07, 2020 , by Maagulf
సౌదీలో మళ్లీ కరోనా తీవ్రత..మరో 19 మంది మృతి

రియాద్:సౌదీ అరేబియాలో తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. కింగ్డమ్ పరిధిలో కొత్తగా మరో 407 మందికి వైరస్ సోకింది. వైరస్ బారిన పడి మరో 19 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో రియాద్ 64, మదీనా 43, జెడ్డా 41, మక్కా 27, దమ్మమ్ లో 10 మందికి వైరస్ సోకింది. వైరస్ బాధితులతో పాటు..కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. 24 గంటల పరిధిలోనే 433 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో మొత్తం 3,36,966 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com