ఐపీఎల్‌ 2021పై క్లారిటీ ఇచ్చిన సౌరభ్ గంగూలీ

- November 07, 2020 , by Maagulf
ఐపీఎల్‌ 2021పై క్లారిటీ ఇచ్చిన సౌరభ్ గంగూలీ

దుబాయ్‌:ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ వచ్చే మంగళవారంతో ముగియనుంది. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడిన ఐపీఎల్‌-2020 సీజన్‌ను  గత సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఏప్రిల్‌, మే నెలల్లో  భారత్‌ వేదికగా జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపాడు.  

ఐపీఎల్‌ 2020 కోసం మాత్రమే యూఏఈని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఏప్రిల్‌, మే నెలల్లో మరోక ఐపీఎల్‌(ఐపీఎల్‌ 2021 సీజన్‌) ఉంటుంది.కేవలం ఐపీఎల్‌ కోసం మాత్రమే యూఏఈని  ఎంచుకున్నాం.ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు భారత్‌ ఆతిథ్యమిస్తుంది. భారత్‌లోనే స్వదేశీ క్రికెట్‌ను నిర్వహిస్తాం. రంజీ ట్రోఫీ కోసం బయో బబుల్‌ను ఏర్పాటు చేస్తాం.గోవా నవంబర్‌ నుంచి గోవాలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఎలాంటి భయం లేదు అని దాదా పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com