కువైట్:మాజీ ఎంపీ కుమారులపై మనీ లాండరింగ్ ఆరోపణలు
- November 08, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని ఓ మాజీ ఎంపీ కుటుంబం చుట్టు ఆర్ధిక అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టాయి. ఎంపీ ముగ్గురు కుమారుల బ్యాంక్ లావాదేవీలు అనుమానస్పదంగా ఉన్నాయని స్థానిక బ్యాంకు అధికారులు ఆర్ధిక నిఘా విభాగానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురు బ్యాంక్ అకౌంట్ల నుంచి విదేశీ బ్యాంక్ అకౌంట్లోకి 1.7 మిలియన్ కువైట్ దినార్లు బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఎంపీ కుమారులకు చెందిన మూడు అకౌంట్లోకి నిధులు జమ అయ్యాయని, ఆ తర్వాత..ఆ సొమ్ము స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న ఓ యూరోపియన్ కంపెనీకి బదిలీ అయినట్లు తెలిపారు. అయితే..ఆ స్విస్ బ్యాంక్ ఖాతా మాజీ ఎంపీదే అయి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం







