సౌదీ:ప్రవాస కార్మీకుల ఫీజు చెల్లించాలనే నిర్ణయంతో 8,967 ఫ్యాక్టరీలకు లబ్ధి
- November 08, 2020
సౌదీ:విదేశీ కార్మికుల ఫీజు చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 8,967 ఫ్యాక్టరీలు నేరుగా లబ్ధి పొందాయని పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే కింగ్డమ్ పరిధిలోని 95 శాతం ఫ్యాక్టరీలు, కంపెనీలు ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ప్రయోజనం చేకూరిందని తెలిపింది. అయితే..సర్వీసులు రద్దు చేయబడిన, లైసెన్స్ గడువు ముగిసిన ఫ్యాక్టరీలు మాత్రం విదేశీ కార్మికుల ఫీజు చెల్లింపుల నుంచి లబ్ధి పొందలేకపోయాయని మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రొత్సాహక విధానం ప్రైవేట్ ఇండస్ట్రియల్ సెక్టార్ కు దోహదం చేస్తుందని, సౌదైజేషన్ కు బలాన్ని చేకూర్చుతుందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 836 కొత్త పరిశ్రమలకు లైసెన్స్ జారీ చేశామని, గత ఏడాదితో పోలిస్తే..95 శాతం ఎక్కువని వివరించారు. లైసెన్స్ ఫ్యాక్టరీల పెట్టుబడుల్లో 116 శాతం
వృద్ధి కనిపించిందన్నారు. మరోవైపు కరోనా సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగం వేగంగా తేరుకుంటోందని కూడా పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా ఒడిదుడుకులతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్న కంపెనీలు, ఫ్యాక్టరీలు గత మూడు నెలల కాలంలో మళ్లీ పూర్తి స్థాయిలో ఉద్యోగులను భర్తీ చేశాయని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







