సౌదీ:ప్రవాస కార్మీకుల ఫీజు చెల్లించాలనే నిర్ణయంతో 8,967 ఫ్యాక్టరీలకు లబ్ధి
- November 08, 2020
సౌదీ:విదేశీ కార్మికుల ఫీజు చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 8,967 ఫ్యాక్టరీలు నేరుగా లబ్ధి పొందాయని పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే కింగ్డమ్ పరిధిలోని 95 శాతం ఫ్యాక్టరీలు, కంపెనీలు ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ప్రయోజనం చేకూరిందని తెలిపింది. అయితే..సర్వీసులు రద్దు చేయబడిన, లైసెన్స్ గడువు ముగిసిన ఫ్యాక్టరీలు మాత్రం విదేశీ కార్మికుల ఫీజు చెల్లింపుల నుంచి లబ్ధి పొందలేకపోయాయని మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రొత్సాహక విధానం ప్రైవేట్ ఇండస్ట్రియల్ సెక్టార్ కు దోహదం చేస్తుందని, సౌదైజేషన్ కు బలాన్ని చేకూర్చుతుందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 836 కొత్త పరిశ్రమలకు లైసెన్స్ జారీ చేశామని, గత ఏడాదితో పోలిస్తే..95 శాతం ఎక్కువని వివరించారు. లైసెన్స్ ఫ్యాక్టరీల పెట్టుబడుల్లో 116 శాతం
వృద్ధి కనిపించిందన్నారు. మరోవైపు కరోనా సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగం వేగంగా తేరుకుంటోందని కూడా పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా ఒడిదుడుకులతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్న కంపెనీలు, ఫ్యాక్టరీలు గత మూడు నెలల కాలంలో మళ్లీ పూర్తి స్థాయిలో ఉద్యోగులను భర్తీ చేశాయని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!









