కరోనా ట్రీట్మెంట్ నిలిపేశారంటూ ప్రచారం..రూమర్స్ గా కొట్టి పారేసిన అధికారులు
- November 08, 2020
మస్కట్: ఒమన్ లోని కొన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ 19 డిపార్ట్మెంట్ ను మూసివేశారని, ఇక కరోనా ట్రీట్మెంట్ చేయరంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ సమాచార కేంద్రం కొట్టిపారేసింది. సుల్తానేట్ పరిధిలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా చికిత్సను పూర్తిగా నిలిపివేశారని, ఇక నుంచి కోవిడ్ వార్డులో పేషెంట్లను చేర్చుకోరంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రభుత్వ యంత్రాంగం వరకు వెళ్లటంతో కోవిడ్ ట్రీట్మెంట్ కు సంబంధించి ప్రభుత్వ సమాచార కేంద్రం స్పష్టతను ఇచ్చింది. సుల్తానేట్ పరిధిలో ట్రీట్మెంట్ నిలిపివేశారని చెబుతున్న ప్రచారంలో నిజం లేదని, మిగిలిన ఆస్పత్రుల తరహాలోనే ఆ ఆస్పత్రిలో కూడా కోవిడ్ పేషెంట్లను చేర్చుకొని చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన