బాగ్దాద్ మీద ఐసిస్ దాడి.. 11 మంది మృతి
- November 09, 2020
బాగ్దాద్: ఐసిస్ గ్రూప్ కు చెందిన ఉగ్రవాదులు బాగ్దాద్ లోని ఓ లుక్ అవుట్ పాయింట్ మీద దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాగ్దాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరలో ఉన్న రద్వానియా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్లను విసిరారు. హాషెద్ రక్షణ బృందాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. మానిటరింగ్ టవర్ మీద మొదట కాల్పులకు తెగబడ్డారు.
దీంతో 5 మంది ట్రైబల్ హాషెద్ బృందానికి చెందిన సభ్యులు మరణించారు. హాషెద్ బృందానికి సహాయం చేయడానికి వచ్చిన ఆరుగురు స్థానికులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఎనిమిది మంది గాయపడిన వారిని సెంట్రల్ బాగ్దాద్ లోని ఆసుపత్రికి తరలించారు.
ఇరాక్ మీద ఐసిస్ గతంలో పట్టు సాధించింది. 2014లో ఇరాక్ లోని చాలా భాగం ఐసిస్ ఆధీనంలో ఉండేది. చాలా నగరాలు ఐసిస్ గుప్పిట్లో పెట్టుకుని మారణహోమం సృష్టించాయి. కానీ అమెరికా దళాలతో కలిసి ఇరాక్ ఐసిస్ ను అంతం చేసే కార్యాచరణ రూపొందించింది. 2017 సంవత్సరంలో ఇరాక్ నుండి ఐసిస్ ను తుదముట్టించారు.
తాజా వార్తలు
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం









