బాగ్దాద్ మీద ఐసిస్ దాడి.. 11 మంది మృతి
- November 09, 2020
బాగ్దాద్: ఐసిస్ గ్రూప్ కు చెందిన ఉగ్రవాదులు బాగ్దాద్ లోని ఓ లుక్ అవుట్ పాయింట్ మీద దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాగ్దాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరలో ఉన్న రద్వానియా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్లను విసిరారు. హాషెద్ రక్షణ బృందాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. మానిటరింగ్ టవర్ మీద మొదట కాల్పులకు తెగబడ్డారు.
దీంతో 5 మంది ట్రైబల్ హాషెద్ బృందానికి చెందిన సభ్యులు మరణించారు. హాషెద్ బృందానికి సహాయం చేయడానికి వచ్చిన ఆరుగురు స్థానికులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఎనిమిది మంది గాయపడిన వారిని సెంట్రల్ బాగ్దాద్ లోని ఆసుపత్రికి తరలించారు.
ఇరాక్ మీద ఐసిస్ గతంలో పట్టు సాధించింది. 2014లో ఇరాక్ లోని చాలా భాగం ఐసిస్ ఆధీనంలో ఉండేది. చాలా నగరాలు ఐసిస్ గుప్పిట్లో పెట్టుకుని మారణహోమం సృష్టించాయి. కానీ అమెరికా దళాలతో కలిసి ఇరాక్ ఐసిస్ ను అంతం చేసే కార్యాచరణ రూపొందించింది. 2017 సంవత్సరంలో ఇరాక్ నుండి ఐసిస్ ను తుదముట్టించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







