వలసదారుల ఇ-బిజినెస్ నిషేధంపై భిన్నమైన స్పందన
- February 16, 2016
ఇండస్ట్రీ, కామర్స్ నఅండ్ టూరిజం మినిస్ట్రీ, బహ్రెయిన్లో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న వలసదారుల్ని బ్యాన్ చేయడంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నిర్ణయం ద్వారా, ఆ బిజినెస్పై ఆధారపడిన వలసదారులు, బహ్రెయిన్ని విడిచిపెట్టే అవకాశం ఉందనీ, అది దేశంలోని అన్ని బిజినెస్లపైనా ఎంతోకొంత ప్రభావం చూపుతుందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే అధికార వర్గాలు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాయి. ఎలాంటి లైసెన్సులూ లేకుండా, ఆఖరికి సరైన అడ్రస్ లేకుండా చేపడ్తున్న ఈ వ్యాపార కార్యకలాపాలు అనైతిక చర్యలకు ఆస్కారం కల్పిస్తాయని అధికారులు చెప్పారు. ఇంకొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. ఇది మంచి నిర్ణయమని కొనియాడారు. స్థానిక వ్యాపారులు లైసెన్సులు పొంది, తమ వ్యాపారాలను ఇ-బిజినెస్ ద్వారా చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేయడం జరిగింది. వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన బిజినెస్ జరుగుతోంది. ఈ రంగంపై 'బ్యాన్' నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







