జరీమానాలు చెల్లించకుండానే వలసదారులు దేశం విడిచి వెళ్ళొచ్చు
- November 11, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్ విడిచి వెళ్ళాలనుకునే వలసదారులు, నవంబర్ 15 నుంచి ఎలాంటి జరీమానాలు చెల్లించకుండానే వెళ్ళిపోవచ్చని చెప్పారు. ఓవర్ స్టేకి సంబంధించిన జరీమానాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ అవకాశం ఇస్తోంది ఒమన్ ప్రభుత్వం. మినిస్రీ& టాఫ్ లేబర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, దేశంలో వుండాలనుకునేవారు ఖచ్చితంగా తమ స్టేటస్ని అప్డేట్ చేసుకోవాలని మినిస్ట్రీ చెబుతోంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లోని మినిస్ట్రీ కార్యాలయాన్ని సందర్శించి దేశం విడచి వెళ్ళడానికి అనుమతి పొందవచ్చు. అంతకు ముందు వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. మినిస్ట్రీ వెబ్సైట్ లేదా సనద్ కార్యాలయాల ద్వారా ‘అప్లికేషన్ ఫర్ డిపాచ్యూర్’ పూర్తి చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!









