జరీమానాలు చెల్లించకుండానే వలసదారులు దేశం విడిచి వెళ్ళొచ్చు
- November 11, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్ విడిచి వెళ్ళాలనుకునే వలసదారులు, నవంబర్ 15 నుంచి ఎలాంటి జరీమానాలు చెల్లించకుండానే వెళ్ళిపోవచ్చని చెప్పారు. ఓవర్ స్టేకి సంబంధించిన జరీమానాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ అవకాశం ఇస్తోంది ఒమన్ ప్రభుత్వం. మినిస్రీ& టాఫ్ లేబర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, దేశంలో వుండాలనుకునేవారు ఖచ్చితంగా తమ స్టేటస్ని అప్డేట్ చేసుకోవాలని మినిస్ట్రీ చెబుతోంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లోని మినిస్ట్రీ కార్యాలయాన్ని సందర్శించి దేశం విడచి వెళ్ళడానికి అనుమతి పొందవచ్చు. అంతకు ముందు వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. మినిస్ట్రీ వెబ్సైట్ లేదా సనద్ కార్యాలయాల ద్వారా ‘అప్లికేషన్ ఫర్ డిపాచ్యూర్’ పూర్తి చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









