జలుబు, దగ్గు, ఆయాసం వున్నవారికి చిట్కాలు...
- November 13, 2020
మనకు ప్రకృతిపరంగా లభించే వాటితో కొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. అరికాళ్లు విపరీతంగా మంట పుడుతుంటే గోరింటాకు గానీ నెయ్యి గానీ సొరకాయ గుజ్జు గానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది.
2. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి.
3. పంటినొప్పిగా ఉంటే లవంగం చప్పరించడం వల్ల కొంత తగ్గుతుంది.
4. చిటికెడు పసుపు గ్లాసు పాలల్లో వేసి కాచి ప్రతిరోజు ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతుంది.
5. తులసి ఆకుల రసంలో ఒక స్పూను తేనె కలిపి చప్పరిస్తే జలుబు, గొంతునొప్పి, దగ్గు వెంటనే తగ్గుతాయి.
6. కాలిన గాయాలకు టూత్ పేస్టును రాయడం వల్ల మంట తగ్గడమే కాకుండా గాయం తొందరగా తగ్గిపోతుంది.
7. క్యారెట్ రసాన్ని, నిమ్మ రసాన్ని సమపాళ్లల్లో తీసుకుని భోజనానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల ముక్కు సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ