జలుబు, దగ్గు, ఆయాసం వున్నవారికి చిట్కాలు...
- November 13, 2020
మనకు ప్రకృతిపరంగా లభించే వాటితో కొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. అరికాళ్లు విపరీతంగా మంట పుడుతుంటే గోరింటాకు గానీ నెయ్యి గానీ సొరకాయ గుజ్జు గానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది.
2. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి.
3. పంటినొప్పిగా ఉంటే లవంగం చప్పరించడం వల్ల కొంత తగ్గుతుంది.
4. చిటికెడు పసుపు గ్లాసు పాలల్లో వేసి కాచి ప్రతిరోజు ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతుంది.
5. తులసి ఆకుల రసంలో ఒక స్పూను తేనె కలిపి చప్పరిస్తే జలుబు, గొంతునొప్పి, దగ్గు వెంటనే తగ్గుతాయి.
6. కాలిన గాయాలకు టూత్ పేస్టును రాయడం వల్ల మంట తగ్గడమే కాకుండా గాయం తొందరగా తగ్గిపోతుంది.
7. క్యారెట్ రసాన్ని, నిమ్మ రసాన్ని సమపాళ్లల్లో తీసుకుని భోజనానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల ముక్కు సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







