జలుబు, దగ్గు, ఆయాసం వున్నవారికి చిట్కాలు...
- November 13, 2020
మనకు ప్రకృతిపరంగా లభించే వాటితో కొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. అరికాళ్లు విపరీతంగా మంట పుడుతుంటే గోరింటాకు గానీ నెయ్యి గానీ సొరకాయ గుజ్జు గానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది.
2. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి.
3. పంటినొప్పిగా ఉంటే లవంగం చప్పరించడం వల్ల కొంత తగ్గుతుంది.
4. చిటికెడు పసుపు గ్లాసు పాలల్లో వేసి కాచి ప్రతిరోజు ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతుంది.
5. తులసి ఆకుల రసంలో ఒక స్పూను తేనె కలిపి చప్పరిస్తే జలుబు, గొంతునొప్పి, దగ్గు వెంటనే తగ్గుతాయి.
6. కాలిన గాయాలకు టూత్ పేస్టును రాయడం వల్ల మంట తగ్గడమే కాకుండా గాయం తొందరగా తగ్గిపోతుంది.
7. క్యారెట్ రసాన్ని, నిమ్మ రసాన్ని సమపాళ్లల్లో తీసుకుని భోజనానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల ముక్కు సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందవచ్చు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







