డాక్యుమెంట్లు లేని వలసదారులకు ఎంబసీ వద్ద ఔట్‌పాస్‌లు

- November 16, 2020 , by Maagulf
డాక్యుమెంట్లు లేని వలసదారులకు ఎంబసీ వద్ద ఔట్‌పాస్‌లు

మస్కట్‌: దేశం విడిచి వెళ్ళాలనుకునే వలసదారుల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆదివారం మొదలైంది. ఎలాంటి రుసుములు చెల్లించకుండానే దేశం విడిచి వెళ్ళేందుకు కల్పించిన ఈ అవకాశం డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో వుంటుంది. మినిస్ట్రీ & టాఫ్‌ లేబర్‌ వెబ్‌సైట్‌ (mol.gov.om)లో రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. వర్క్‌ వీసా గడువు తీరిన వలస కార్మికులు, స్వదేశానికి వెళ్ళేందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించారు. మినిస్ట్రీకి చెందిన వెబ్‌సైట్‌తోపాటు సనద్‌ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. రిజిస్ట్రేషన్‌ జరిగిన ఏడు రోజుల తర్వాత, విమాన ప్రయాణానికి ఏడు గంటల ముందు వలస కార్మికుడు మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ కార్యాలయాన్ని సందర్శించాల్సి వుంటుంది. చెల్లుబాటయ్యే టిక్కెట్టు అలాగే ట్రావెల్‌ డాక్యుమెంట్లు, 72 గంటల ముందుగా చేయించుకున్న పీసీఆర్‌ టెస్ట్‌ వివరాలు తమ వెంట తీసుకెళ్ళాలి. వలసదారులు, సరైన డాక్యుమెంటేషన్‌ లేనిపక్షంలో, వారు ఎంబసీలను సంప్రదించాలి. పాస్‌పోర్ట్‌ లేనివారు కూడా, ఎంబసీ జారీ చేసే ఔట్‌పాస్‌తో స్వదేశానికి వెళ్ళవచ్చు. బంగ్లాదేశీ వలసదారులు బర్త్‌ రిజిస్ట్రేషన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ కాపీ లేదా నేషనల్‌ ఐడీ కార్డుని సమర్పించాలి. సామాజిక కార్యకర్తలు ఆయా ఎంబసీలతో కలిసి వలసదారులకు సహాయ సహకారాలు అందిస్తారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com