చెన్నయ్, హైద్రాబాద్లకు ఒమన్ ఎయిర్ విమానాలు
- November 16, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్, భారతదేశంలోని చెన్నయ్ అలాగే హైద్రాబాద్ నగరాలకు వారంలో రెండు రోజులపాటు నడిచే విమానాల్ని ప్రకటించింది. నవంబర్ 19 నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. డిసెంబర్ 31 వరకు వీటి షెడ్యూల్స్ని ఖరారు చేశారు. ఒమన్ ఎయిర్ వెబ్సైట్ అలాగే ఎయిర్ లైన్ కార్యాలయాలు, ట్రావెల్ ఏజెంట్ల వద్ద పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ప్రయాణీకులు మాస్క్ ధరించడం తప్పనిసరీ అనీ, విమానంలోకి ఎక్కేముందు, దిగేముందు ప్రయాణీకుల మధ్య తగిన దూరం అవసరమనీ ఒమన్ ఎయిర్ పేర్కొంది. క్యాబిన్ సిబ్బంది వ్యక్తిగత భద్రతా సాధనాలు ధరించాల్సి వుంటుందనీ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మీల్ సర్వీస్ కూడా మార్చడం జరిగిందని ఒమన్ ఎయిర్ వెల్లడించింది. ఒమన్ నుంచి బయల్దేరేవారు ప్రీ-డిపాచ్యూర్ రిక్వైర్మెంట్స్ తప్పక కలిగి వుండాలి. ఆ వివరాలు ఒమన్ ఎయిర్ వెబ్సైట్లో వుంటాయి. ఆయా డెస్టినేషన్లకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా కలిగి వుండాల్సిందే. ఈ వివరాలు సివిల్ ఏవియేషన్ అథారిటీ వెబ్సైట్లో వుంటాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఒమన్)
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









