చెన్నయ్, హైద్రాబాద్లకు ఒమన్ ఎయిర్ విమానాలు
- November 16, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్, భారతదేశంలోని చెన్నయ్ అలాగే హైద్రాబాద్ నగరాలకు వారంలో రెండు రోజులపాటు నడిచే విమానాల్ని ప్రకటించింది. నవంబర్ 19 నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. డిసెంబర్ 31 వరకు వీటి షెడ్యూల్స్ని ఖరారు చేశారు. ఒమన్ ఎయిర్ వెబ్సైట్ అలాగే ఎయిర్ లైన్ కార్యాలయాలు, ట్రావెల్ ఏజెంట్ల వద్ద పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ప్రయాణీకులు మాస్క్ ధరించడం తప్పనిసరీ అనీ, విమానంలోకి ఎక్కేముందు, దిగేముందు ప్రయాణీకుల మధ్య తగిన దూరం అవసరమనీ ఒమన్ ఎయిర్ పేర్కొంది. క్యాబిన్ సిబ్బంది వ్యక్తిగత భద్రతా సాధనాలు ధరించాల్సి వుంటుందనీ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మీల్ సర్వీస్ కూడా మార్చడం జరిగిందని ఒమన్ ఎయిర్ వెల్లడించింది. ఒమన్ నుంచి బయల్దేరేవారు ప్రీ-డిపాచ్యూర్ రిక్వైర్మెంట్స్ తప్పక కలిగి వుండాలి. ఆ వివరాలు ఒమన్ ఎయిర్ వెబ్సైట్లో వుంటాయి. ఆయా డెస్టినేషన్లకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా కలిగి వుండాల్సిందే. ఈ వివరాలు సివిల్ ఏవియేషన్ అథారిటీ వెబ్సైట్లో వుంటాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఒమన్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







