కువైట్: ఆన్ లైన్ ఓపెన్ హౌజ్ ను ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభించనున్న ఇండియన్ ఎంబసీ
- November 17, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారతీయుల సమస్యలను తెల్సుకొని వాటిని పరిష్కారించేందుకు చేపట్టిన ఓపెన్ హౌజ్ ను ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25న బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆన్ లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కువైట్ లోని భారతీయులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపింది. అయితే..ఆన్ లైన్ మీటింగ్ ఐడీ పొందెందుకు ముందుగానే తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ హౌజ్ లో పాల్గొనాలని అనుకునే వారు...పాస్ పోర్టులో ఉన్న తమ పూర్తి పేరు, సివిల్ ఐడీ నెంబర్, కాంటాక్ట్ నంబర్, కువైట్ లో ప్రస్తుతం ఉంటున్న పూర్తి అడ్రస్ తో పాటు ఓపెన్ హౌజ్ లో తాము ఎలాంటి సమస్యను చెప్పదల్చుకున్నారో దానికి సంబంధించి క్లుప్తంగా వివరిస్తూ ముందుగా ఎంబసీకి [email protected] ద్వారా మెయిల్ చేయాలి. మెయిన్ పంపిన వారికి ఓపెన్ హౌజ్ ఆన్ లైన్ మీటింగ్ కు సంబంధించి ఐడీ వివరాలను పంపిస్తారు. ఆ ఐడీ ద్వారా ఓపెన్ హౌజ్ లో పాల్గొని తమ సమస్యను ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చరు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







