కువైట్: ఆన్ లైన్ ఓపెన్ హౌజ్ ను ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభించనున్న ఇండియన్ ఎంబసీ
- November 17, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారతీయుల సమస్యలను తెల్సుకొని వాటిని పరిష్కారించేందుకు చేపట్టిన ఓపెన్ హౌజ్ ను ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25న బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆన్ లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కువైట్ లోని భారతీయులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపింది. అయితే..ఆన్ లైన్ మీటింగ్ ఐడీ పొందెందుకు ముందుగానే తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ హౌజ్ లో పాల్గొనాలని అనుకునే వారు...పాస్ పోర్టులో ఉన్న తమ పూర్తి పేరు, సివిల్ ఐడీ నెంబర్, కాంటాక్ట్ నంబర్, కువైట్ లో ప్రస్తుతం ఉంటున్న పూర్తి అడ్రస్ తో పాటు ఓపెన్ హౌజ్ లో తాము ఎలాంటి సమస్యను చెప్పదల్చుకున్నారో దానికి సంబంధించి క్లుప్తంగా వివరిస్తూ ముందుగా ఎంబసీకి [email protected] ద్వారా మెయిల్ చేయాలి. మెయిన్ పంపిన వారికి ఓపెన్ హౌజ్ ఆన్ లైన్ మీటింగ్ కు సంబంధించి ఐడీ వివరాలను పంపిస్తారు. ఆ ఐడీ ద్వారా ఓపెన్ హౌజ్ లో పాల్గొని తమ సమస్యను ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చరు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









