సుశీలమ్మకు శతమానంభవతి
- November 20, 2020
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పి సుశీల పాడిన తెలుగు సినీగీతాలలోని 100 ఆణిముత్యాలవంటి పాటలతో "గానకోకిల పాటకు పట్టాభిషేకం" అనే కార్యక్రమాన్ని అంతర్జాలం ద్వారా 21వ తేదీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:00కు ప్రముఖ నటీమణి ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు చేతులమీదుగా ప్రారంభించనున్నారని, 12 మంది ప్రముఖ గాయనీమణులు సుశీల పాటలను ఆలపించి అలరించనున్నారని కార్యక్రమ నిర్వాహకులు, వంశీ ఇంటర్నేషనల్ మరియు సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధిక మంగిపూడి, సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, శారదా కళాసమితి అధ్యక్షులు దోగిపర్తి శంకర్రావు తెలియజేశారు.
12 గంటలపాటు నిర్విరామంగా కొనసాగనున్న ఈ సంగీత మహోత్సవ కార్యక్రమంలో రాధిక నోరి (అమెరికా), విజయలక్ష్మి భువనగిరి, సురేఖ మూర్తి దివాకర్ల, వేదాల శశికళ స్వామి, శారదా రెడ్డి, శివశంకరి గీతాంజలి, శారద సాయి, శ్రీదేవి, రావూరి మాధవి, హిమబిందు, శైలజా చిలుకూరి (సింగపూర్), సౌభాగ్యలక్ష్మీ (సింగపూర్) 12 మంది సుమధుర గాయనీమణులు 100 పాటలను ఆలపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలలనుండి సినీ సంగీత ప్రేమికులు, సుశీల అభిమానులు అందరూ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరిగే ప్రత్యక్ష ప్రసారం లో చూడవచ్చునని తెలుపుతూ నిర్వాహకులు అందరికీ సాదర ఆహ్వానం పలికారు.
ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసారం
https://www.facebook.com/permalink.php?story_fbid=189891509447208&id=108993030870390
యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం
https://youtu.be/Lgz9psISSgQ
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







