కంపెనీ పీఆర్వోల ద్వారా పాస్పోర్ట్ అప్లికేషన్లను స్వీకరిస్తున్న ఇండియన్ ఎంబసీ
- November 25, 2020
అబుధాబి లోని ఇండియన్ ఎంబసీ, దరఖాస్తుదారులు లేకుండానే, ఆయా కంపెనీల పీఆర్వోల ద్వారా పాస్పోర్ట్ అప్లికేషన్లను స్వీకరించడం ప్రారంభించింది. ఈ మేరకు ఎంబసీ ఓ ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. సీనియర్ మేనేజ్మెంట్, డైరెక్టర్స్ అలాగే సీఈఓలు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన అప్లికేషన్లను తమ పీఆర్వోల ద్వారా సమీపంలోని బిఎల్ఎస్ సెంటర్, ఎంబసీలో అందించవచ్చు. అంతకు ముందు దరఖాస్తుదారులు, తమ పేపర్స్ని స్వయంగా అందించాలని ఎంబసీ కోరడం జరిగింది. అయితే, కరోనా నేపథ్యంలో ఈ విధానంలో మార్పులు చేశారు. ఈ విధానం ద్వారా అప్లికేషన్లను సమర్పించే దరఖాస్తుదారులకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా పొందుపరిచారు. ఎంప్లాయర్ లేదా కంపెనీ ఓ లెటర్ని ఎంబసీకి రాయాల్సి వుంటుంది సదరు పీఆర్వో విషయమై. ఉద్యోగి కూడా ఓ లేఖను పీఆర్వోకి ఇవ్వాల్సి వుంటుంది. పీఆర్వో, గుర్తింపు కోసం ఐడీ సహా సంబంధిత డాక్యుమెంట్లను బిఎల్ఎస్ సెంటర్లలో తగిన సొమ్ము చెల్లించి అందించవచ్చు. కొత్త మరియు పాత పాస్పోర్టులను స్వయంగా స్వీకరించడానికి లేదా కొరియర్ ద్వారా పొందడానికి తగిన ఆప్షన్ని కూడా ఎంచుకోవడానికి వీలుంది.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







