మొబైల్ యాప్ తో భారత్ నేరుగా మనీ ట్రాన్స్ ఫర్..సర్వీసులు ప్రారంభించిన ఖతార్ బ్యాంక్
- November 25, 2020
ఖతార్ లో ఉంటున్న భారతీయులు..ఇక నుంచి భారత్ లోని తమ బంధువులకు డబ్బులు పంపించటం మరింత సులభం కానుంది. క్షణాల్లో ఇండియాలోని బ్యాంకు ఖతాలకు నగదు బదిలీ చేసేలా ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్ మొబైల్ సర్వీసులను ప్రారంభించింది. కేవలం 60 సెకండ్లలో మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చని బ్యాంక్ ప్రతినిధులు వెల్లడించారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని..మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. డెబిట్ కార్డు నెంబర్, పిన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొని ఇన్ స్టెంట్ సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు నగదు బదిలీలపై ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. నగదు బదిలీ కోసం ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్...భారత్ లోని హెచ్.డీ.ఎఫ్.సీ. బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఇండియాలోని బ్యాంకులకు మాత్రమే నగదు బదిలీ సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఇతర దేశాల్లోనూ మనీ ట్రాన్స్ ఫర్ స్కీంను అమలు చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!







