63 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
- November 29, 2020
కువైట్ సిటీ:కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం తమ అగ్ని మాపక సిబ్బంది, భారీ వర్షాల నేపథ్యంలో వరలో చిక్కుకుపోయిన 63 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని డైరెక్టరేట్ పేర్కొంది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనాస్ అల్ సలెహ్, ఆపరేషన్స్ రూమ్ని సందర్శించగా, ఫైర్ బ్రిగేడ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలెద్ అల్ మెక్వాద్ ఆయా అంశాల గురించి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలనీ, చెరువులు, నీటి ప్రవాహాలు వున్న ప్రాంతాల వైపు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 112 నెంబర్కి ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









