ఫేక్ ఐపీ అడ్రస్ వినియోగిస్తే 2 మిలియన్ దిర్హాముల జరీమానా
- November 29, 2020
దుబాయ్:ఫేక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ని వినియోగించి నేరాలకు పాల్పడితే, అలాంటివాసరరియకి 500,000 దిర్హాముల నుంచి 2 మిలియన్ దిర్హాముల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చు. అలాగే జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరోమారు స్పష్టం చేసింది. ఐపీ అడ్రస్ అనేది కంప్యూటర్ నెట్వర్క్లో కమ్యూనికేషన్ కోసం ఆయా డివైజ్లకు ఏర్పాటు చేయబడుతుందనీ, ఫెడరల్ చట్టం 5 - 2012, ఆర్టికల్ 9 ప్రకారం, సైబర్ క్రైమ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనీ అధికారులు హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో 500,000 దిర్హాములకు తగ్గకుండా 2 మిలియన్ దిర్హాములకు మించకుండా జరీమానాతోపాటు, జైలు శిక్ష కూడా పడే అవకాశం వుంది. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా థర్డ్ పార్టీ ఐపీ అడ్రస్ని క్రియేట్ చేసుకుంటే అది నేరం కింద పరిగణిస్తారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







