న్యూడిజైన్లలో ఎమిరేట్స్ ఐడీలు, పాస్ పోర్టులు..యూఏఈ మంత్రివర్గం నిర్ణయం
- November 30, 2020
దుబాయ్:ఎమిరేట్స్ ఐడీ కార్డులు, పాస్ పోర్టులకు న్యూలుక్ రానుంది. మరింత భద్రత ప్రమాణాలు, న్యూ జనరేషన్ డిజైన్లతో ఎమిరేట్స్ ఐడీ కార్డులు, పాస్ పోర్టులను భర్తీ చేయాలని యూఏఈ మంత్రివర్గం నిర్ణయించింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం...ఐడీ, పాస్ పోర్టు డిజైన్లతో పాటు సైబర్ సెక్యూరిటీ మండలి ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ.. పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ సుల్తాన్ అల్ జబెర్ ను యూఏఈ ప్రతినిధిగా నియమించింది. ప్రకృతి ఎదుర్కొంటున్న సవాళ్లు, పర్యావరణ మార్పులపై జరిగే ప్రపంచ సదస్సులకు ఆయన యూఏఈ తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాదు..కింగ్డమ్ పరిధిలో పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలను తీసుకుంటారు. పర్యావరణ పరిక్షణ పాలసీ కింది మొత్తం 8 అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయాలని, తద్వార క్లైమెట్ పై ప్రభావం చూపే అంశాలను నివారించటం, ప్రకృతి సంపదను కాపాడుకోవటం, గాలిలో స్వచ్ఛతను పెంపొందించేలా చర్యలు చేపట్టడం...పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించటం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









