భారత్ దేశ వ్యాప్తంగా పేదలకోసం 80వేల ఇళ్లు

- February 18, 2016 , by Maagulf
భారత్ దేశ వ్యాప్తంగా పేదలకోసం 80వేల ఇళ్లు

 భారత్ దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికోసం 80వేల గృహాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రూ.4వేల కోట్లను ఖర్చు చేయనుంది. గురువారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణపేదరిక నిర్మూలనశాఖ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 163 పట్టణాల్లో వీటిని నిర్మించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.1.50లక్షలను ఖర్చుచేయాలని, మొత్తం రూ.4,076కోట్లను వెచ్చించాలని ప్రణాళిక రూపొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com