యూఏఈ నేషనల్ డే: భద్రతకోసం 127 పోలీస్ పెట్రోల్స్
- December 01, 2020
షార్జా: 49వ యూఏఈ నేషనల్ డే, ఈ నేపథ్యంలో వచ్చిన నాలుగు రోజుల సెలవుల దృష్ట్యా మొత్తం 127 పెట్రోల్స్ని షార్జా వ్యాప్తంగా మోహరించారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా.? లేదా.? అనే విషయమై పోలీస్ పెట్రోల్స్ పరిశీలించనున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో బీచ్లకు వెళ్ళేవారు, ఎడారులు సహా, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళే వివిధ ప్రదేశాల్లో కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ ట్రాఫిక్ మీడియా బ్రాంచ్ డైరెక్టర్ కెప్టెన్ సౌద్ అల్ షాయిబా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి, కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. మేరిటైమ్ రెస్క్యూ పెట్రోల్స్ని బీచ్లలో రక్షణ కోసం వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







