రేపు కేంద్రంతో మరోసారి రైతుల చర్చలు
- December 02, 2020
న్యూఢిల్లీ: రైతులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిన్న సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ చర్చలు ఫలపద్రం కాకపోవడంతో గురువారం మరోసారి సమాశమయ్యేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. దీంతో రేపు మరోసారి రైతులతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. చర్చల సమయంలో రైతు సంఘాల ప్రతినిధులు ఇప్పుడు కమిటీల ఏర్పాటు చేయడానికి సమయం లేదు అని స్పష్టం చేశారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎక్కువ మంది సభ్యులుంటే ఏకాభిప్రాయం రావడం కష్టమని, ఐదారుగురు నేతలు కమిటీగా రావాలని సూచించారు. ఏ చర్చకైనా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. నాలుగో రౌండ్ చర్చలు గురువారం జరుగుతాయని పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









