యూఏఈ నేషనల్ డే: అభిమానం చాటిన తెలంగాణ యువతి

- December 02, 2020 , by Maagulf
యూఏఈ నేషనల్ డే: అభిమానం చాటిన తెలంగాణ యువతి

యూఏఈ:యూఏఈలో నివసించే ప్రవాస భారతీయులకి మాతృభూమి భారతదేశము ఎంతో కర్మభూమి అయిన యూఏఈ కూడా అంతే.జీవనోపాధి, భధ్రత, ఉన్నత జీవిన విధానము కల్పించే ఈ సుందర దేశం పట్ల అభిమానం ఉండటం అత్యంత సహజం.ప్రతి ఏటా  డిసెంబర్ 2 న యూఏఈ లో సంయుక్త  రాజ్య అవతరణోత్సవం జరుగుతుంది.ఈ సంవత్సరం డిసెంబర్ 2, 2020న యూఏఈ అవతరణకి  49 వసంతాలు నిండాయి.ఈ సందర్భాన్ని యూఏఈ లో నివసిస్తున్న తెలంగాణ వాసి లత పల్తి మరియు తన కుమార్తె ఐరా పల్తి యూఏఈ జాతీయ పతాక రంగులలో వస్త్రాలు ధరించి జెండా పట్టుకుని అభిమానం చాటుకున్నారు.మన కర్మభూమి ఎంతో అభివృద్ధి చెందాలని, ఈ దేశవాసులందరు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో ఎప్పుడు సుఖంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వర్ణ జాతీయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని  అభిమానంతో కూడిన అభినందనలు తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com