ఫైజర్ వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం
- December 02, 2020
లండన్:యూఎస్ లో కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ను వివిధ దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ట్రయల్స్ మంచి ఫలితాలను ఇస్తున్నది. వ్యాక్సిన్ ను రిలీజ్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే ఫైజర్ సంస్థ అమెరికన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై అమెరికా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నది. ఇక ఇదిలా ఉంటె, ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యూకే లో ఆమోదం పొందటంతో అక్కడ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఫైజర్ ఏర్పాట్లు చేస్తున్నది ఈనెల 7 వ తేదీ నుంచి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముందుగా 80ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారు. ఆ తరువాత కరోనా వారియర్స్ కు, అనంతరం మిగతా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. యూకేలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!









