అబుదాబీలో ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌: కొత్త నిబంధన

- December 09, 2020 , by Maagulf
అబుదాబీలో ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌: కొత్త నిబంధన

అబుధాబి: జనవరి 31 లోపు గడువు తీరే పాస్‌పోర్టుల రెన్యువల్‌ మాత్రమే చేపడుతున్నట్లు అబుదాబీలోని ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. తదుపరి నోటీస్‌ వచ్చేవరకూ ఈ నిబంధన అమల్లో వుంటుందని ఎంబసీ మిషన్‌ పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అత్యవసరంగా పాస్‌పోర్ట్‌ సేవలు కావాల్సినవారు, తమ డాక్యుమెంట్లను మెయిల్‌ చేయాల్సి వుంటుంది. ఎమర్జన్సీకి సంబంధించిన వివరాల్ని కూడా ఇ-మెయిల్‌లో వెల్లడించాలి. ఎంబసీ, అలాంటి అత్యవసర విషయాలపై తక్షణం స్పందించి, తదిన కాన్సులర్‌ సేవలు అందించడం జరుగుతుంది. గత నెలలో ఎంబసీ మరో సూచన కూడా చేయడం జరిగింది. కంపెనీ పీఆర్వోల ద్వారా ఉద్యోగుల అప్లికేషన్లను సమర్పించడానికి అవకాశం కల్పించారు. తద్వారా నేరుగా కంపెనీ ఎంప్లాయిస్‌ ఎంబసీని ఆశ్రయించాల్సిన అవసరం వుండదు. అంతకు ముందు సమీపంలోని బిఎల్‌ ఎస్‌ సెంటర్‌ వద్ద వ్యక్తిగతంగా దరఖాస్తుదారులు హాజరవ్వాల్సి వచ్చేది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com