నేడు భారత దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతుల నిరాహార దీక్షలు
- December 14, 2020
న్యూఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఢిల్లీ సరిహద్దుల్లో అన్ని రైతు సంఘాల నాయకులు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. రైతులకు మద్దతుగా తాను కూడా నిరాహార దీక్ష చేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ కార్యకర్తలతోపాటు దేశ ప్రజలందరూ ఒక్క రోజు దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరోవైపు, కొత్త చట్టాలపై ప్రభుత్వానికి పలువురు రైతులు మద్దతు ప్రకటిస్తున్నారని, వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు ఉద్యమ నేతలు స్పష్టంచేశారు. ప్రభుత్వంతో చేతులు కలిపి తమ పోరాటానికి వెన్నుపోటు పొడవాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆదివారం రాజస్థాన్లోని షాజహాన్పూర్ నుంచి రైతన్నలు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించగా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









