నేడు భారత దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతుల నిరాహార దీక్షలు
- December 14, 2020న్యూఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఢిల్లీ సరిహద్దుల్లో అన్ని రైతు సంఘాల నాయకులు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. రైతులకు మద్దతుగా తాను కూడా నిరాహార దీక్ష చేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ కార్యకర్తలతోపాటు దేశ ప్రజలందరూ ఒక్క రోజు దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరోవైపు, కొత్త చట్టాలపై ప్రభుత్వానికి పలువురు రైతులు మద్దతు ప్రకటిస్తున్నారని, వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు ఉద్యమ నేతలు స్పష్టంచేశారు. ప్రభుత్వంతో చేతులు కలిపి తమ పోరాటానికి వెన్నుపోటు పొడవాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆదివారం రాజస్థాన్లోని షాజహాన్పూర్ నుంచి రైతన్నలు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించగా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు