వదిలివేయబడ్డ వాహనాల ఆక్షన్
- December 14, 2020
మస్కట్:వదిలివేయబడ్డ వాహనాల్ని జనరల్ పబ్లిక్, అమెరాత్లోని బలాదియా యార్డ్లో పరీక్షించుకోవచ్చని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. పలు రకాల ఉల్లంఘనల నేపథ్యంలో వాహనాల్ని స్వాధీనం చేసుకోవడం లేదా సివిక్ అథారిటీ ద్వారా బలవంతంగా తరలించిన వాహనాల్ని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. ఆయా వాహనాల విషయమై యజమానులు ముందుకు రాని పక్షంలో, వాటిని ఆక్షన్ వేసే అవకాశం వుంటుంది. డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వాహనాల్ని పరిశీలించి, తమ ఆలోచనల మేరకు ఏదన్నా వాహనాన్ని కొంత మొత్తం చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఆక్షన్ వేయబడే ప్రాంతంలోకి ప్రవేశించేందుకు 4 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి వుంటుంది. ఇది తిరిగి చెల్లించబడదు. ఆక్షన్లో పాల్గొనేందుకు తిరిగి చెల్లించే వీలున్న 500 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి వుంటుంది. సక్సెస్ఫుల్ బిడ్డింగ్ తర్వాత మొత్తం సొమ్ముతోపాటు, 3 శాతం ప్రమోషనల్ ఛార్జీలు చెల్లించాలి. ఆక్షన్ పూర్తయ్యాక 10 రోజుల్లోగా ఓనర్షిప్ బదలాయించబడుతుంది. ఆలస్యం చేస్తే రోజుకి 50 ఒమన్ రియాల్స్ ఛార్జీ వుంటుంది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









