బిట్స్ పిలానీలో రెండో దశ విస్తరణ....
- February 20, 2016
రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చేందుకు కృషి చేస్తానని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్పేట్ మండలం బిట్స్పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో శనివారం రెండో దశ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... బిట్స్ పిలానీలో రెండో దశ విస్తరణలో భాగంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 370 కోట్లతో నిర్మాణాలు చేపడతారని వెల్లడించారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ లో ప్రస్తుతం 3,200 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చేస్తున్నారు. నూతన భవనం పూర్తయితే అదనంగా 5,300 మంది విద్యార్థులు చదివేందుకు వీలుంటుంది. బిట్స్ చైర్మన్ కుమార మంగళం ఆశయాన్ని(10 వేల మంది విద్యార్థులు) సాధించేందుకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని కేటీఆర్ అన్నారు.బిట్స్ డెరైక్టర్ వి.ఎస్.రావు మాట్లాడుతూ నూతన భవనం 2018 చివరికి పూర్తవుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







