యెమెన్‌లో హుమానిటేరియన్‌ క్రైసిస్‌పై ఖతార్‌ కాన్ఫరెన్స్‌

- February 20, 2016 , by Maagulf
యెమెన్‌లో హుమానిటేరియన్‌ క్రైసిస్‌పై ఖతార్‌ కాన్ఫరెన్స్‌

ఖతార్‌, యెమెన్‌లోని హుమానిటేరియన్‌ క్రైసిస్‌పై ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు స్పెషల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ఖతార్‌ ఛారిటీ మరో 13 సంస్థలతో కలిసి ఈ కాన్ఫరెన్స్‌ని నిర్వహిస్తున్నారు. ఇందులో 90 స్థానిక మరియు అంతర్జాతీయ, ప్రాంతీయ హుమానిటేరియన్‌ సంస్థలు, 150కి పైగా ప్రముఖులు పాల్గొననున్నారు. యెమెన్‌లో ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నవారికి అండగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే అంతర్జాతీయ స్థాయిలో వ్యవహరించాల్సిన విధానం గురించి ఈ కాన్ఫరెన్స్‌లో చర్చ జరుగుతుంది. ప్రపంచంలో యెమెన్‌ సమస్య అత్యంత తీవ్రమైన హుమానిటేరియన్‌ సమస్యగా మారింది. 26 మిలియన్‌ ్పజల్లో 80 శాతం మంది యెమెన్‌లో పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com