కొత్త రూట్లలో స్పైస్జెట్
- December 18, 2020
ముంబై:స్పైస్జెట్ మరో 30 రూట్లకు సర్వీసులను దశలవారీగా వచ్చే వారం నుంచి ఆరంభించబోతున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగా రద్దుచేసుకున్న విమానాల్లో మళ్లీ 80 శాతం వరకు సర్వీసులను ఆరంభించుకోవచ్చన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్పైస్జెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంట్లోభాగంగా రేపటి నుంచి అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్ల నుంచి బీహార్లోని దార్భంగ మధ్య విమాన సర్వీసులు నడుపబోతుంది. అలాగే కొత్తగా హైదరాబాద్-వైజాగ్, ముంబై-గోవా, కోల్కతా-గోవా, అహ్మదాబాద్-గోవా, ముంబై-కంద్లా, ముంబై-గువాహటి, గువాహటి-కోల్కతా, చెన్నై-షిర్డిల మధ్య సర్వీసులు రానున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల మధ్య కూడా స్పైస్ జెట్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి... కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. జాతీయ, అంతర్జాయ విమానా సర్వీసులను పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే.. క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్నింటికి అనుమతి ఇస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







