రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ
- December 25, 2020
న్యూ ఢిల్లీ:కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లు విడుదల అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆ మొత్తాన్ని విడుదల చేశారు. సుమారు 9 కోట్ల మంది రైతులకు ఈ నిధి అందనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్న విషయం తెలిసిందే. కిసాన్ నిధి స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఎకరానికి రెండు వేల రూపాయాలు జమ అవుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డును కూడా రైతులు వాడుకోవాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు. 18 వేల కోట్ల అమౌంట్ను రిలీజ్ చేసిన తర్వాత మోదీ.. అరుణాచల్ ప్రదేశ్ రైతులతో మాట్లాడారు. మొత్తం ఆరు రాష్ట్రాల రైతులతో ఆయన వీడియోకాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









