వలసదారులకు ఆమ్నెస్టీ: డిసెంబర్ 31తో ముగియనున్న గడువు
- December 26, 2020
మనామా:కాన్సులర్ సర్వీసులు అలాగే కార్మిక సమస్యలకు సంబంధించి భారత అంబాసిడర్ పియూష్ శ్రీవాస్తవ, కమ్యూనిటీ మెంబర్తో వర్చువల్గఆ సమావేశమయ్యారు. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు శ్రీవాస్తవ. కాన్సులర్ సేవలు అవసరమైనవారికి వాలంటీర్ల ద్వారా సాయం అందించే కార్యక్రమం పునఃప్రారంభమయ్యిందని ఆయన తెలిపారు. కోవిడ్ 19 పరీక్ష ధరను 60 బహ్రెయినీ దినార్లు నుంచి 40 బహ్రెయినీ దినార్లకి తగ్గించిన బహ్రెయిన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారాయన. కాగా, ఇండియన్ ఎంబసీ 350 షార్ట్ వాలిడిటీ పాస్పోర్టుల్ని జారీ చేసిందనీ, తద్వారా బహ్రెయిన్లో తమ స్టేటస్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి వారికి వీలు కలుగుతుందని చెప్పారు. డిసెంబర్ 31తో వలసదారులకు అమ్నెస్టీ ముగియనుంది. ఇండియన్ ఎంబసీ ఎమర్జన్సీ టెలిఫోన్ నెంబర్ 00973 39418071 ను ఏమార్చి అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని శ్రీవాస్తవ ప్రస్తావించారు. ఈ తరహా ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







