'ఆయుష్మాన్ భారత్' స్కీమ్ లాంచ్ చేసిన మోడీ..ఏమిటి దీని ప్రత్యేకత?
- December 26, 2020
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆయుష్మాన్ భారత్ స్కీంను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా లాంచ్ చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతవాసులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంను పొడిగించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ స్కీం కింద హెల్త్ కవరేజ్ తో పాటు ఫైనాన్షియల్ రిస్క్ ప్రొటెక్షన్, హెల్త్ సర్వీసెస్ ప్రొటెక్షన్ వంటివి సమకూరుతాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర పాలిత ప్రాంత గవర్నర్, మనోజ్ సిన్హాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం కింద కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండే వారందరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అది కూడా దాదాపు రూ.5లక్షల వరకూ ఇస్తారన్నమాట.
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) పొడిగింపులో భాగంగా.. దాదాపు 15లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అక్కడి ప్రాంతాల్లో ఉండే వారు పీఎం-జేఏవై స్కీం కింద ఎక్కడైనా సర్వీసులు పొందవచ్చని పీఎంఓ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









