రష్యాలో కొనసాగుతున్న కరోనా తీవ్రత..
- December 26, 2020
మాస్కో:ఏడాది కాలంగా కరోనా మహమ్మరి తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రపంచం తల్లడిల్లుతోంది. ముఖ్యమంగా రష్యాలో కరోనా మహమ్మారి విజృంభణ ఏమాత్రం తగ్గడంలేదు. రోజుకు 25 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 29,258 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ఆదేశ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. దీంతో రష్యాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షల మార్కును దాటి 30,21,964కు చేరుకుంది. కొత్తగా నమోదైన మొత్తం కేసులలో రాజధాని మాస్కోలోనే 7,480 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక, కరోనా మరణాలు కూడా రష్యాలో భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 567 మంది కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఆ దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 54,226కు చేరింది. మరోవైపు, గత 24 గంటల్లో 28,185 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కావడంతో మొత్తం రికవరీల సంఖ్య 24,26,439కి పెరిగింది. కాగా, బ్రిటన్ కేంద్రంగా ప్రబలుతున్న కొత్త వైరస్ కారణంగా రష్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు త్వరలో కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







