తెలంగాణలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
- December 27, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి.. గత బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 317 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా... తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 472 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... ఇక, ఇద్దరు మృతిచెందగా... 509 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు... దీంతో... పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,863కు పెరగగా... ఇప్పటి వరకు 2,76,753 మంది రికవరీ అయ్యారు... కరోనా బారినపడి 1531 మంది మృతిచెందారు.. దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గిందని... దేశవ్యాప్తంగా రికవరీ రేటు 95.8 శాతంగా ఏంటే రాష్ట్రంలో 97.15 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,579 యాక్టివ్ కేసులు ఉండగా... అందులో 4,426 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్ఆరు.. గత 24 గంటల్లో 37,347 శాంపిల్స్ పరీక్షించగా... 472 పాజిటివ్ కేసులు వెలుగుచేశాయి.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ల సంఖ్య 67,23,710కు పెరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?